Corona: కరోనా ట్రీట్మెంట్కు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా..? ఈ తప్పు చేస్తే మీకే లాస్..
దేశంలో మళ్లీ కరోనా ఛాయలు కనిపిస్తున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్-19 కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. ఏపీలో ఇటీవల కోవిడ్ మరణాలు చోటుచేసుకుంటుండటం, కొన్ని నగరాల్లో కొత్తగా నమోదవుతున్న కేసులు మరోసారి టెన్షన్ పుట్టిస్తున్నాయి. అయితే కరోనా మరణాలు స్వల్ప మొత్తంలో సంభవించినా.. మళ్లీ 2021 నాటి తీవ్ర పరిస్థితులు రావని వైద్యులు అంటున్నారు. కేసుల పెరుగుదల స్థానికంగానే ఉంటుందంటున్న నిపుణులు.. గత వేవ్లలో కనిపించినట్లుగా ఆస్పత్రుల్లో రోగుల రద్దీ, ఆక్సిజన్ కొరత, ఐసీయూలు నిండిపోవడం…
