పశ్చిమాసియాలో మరోసారి టెన్షన్.. హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా మెరుపు దాడులు
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఉద్రిక్తతలు తగ్గకపోగా అమెరికా సైన్యం ఇరాన్లోని సైనిక స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిలో అమెరికా బలగాలకు మరియు అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు పొంచి ఉన్న ముప్పును అరికట్టడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం, అమెరికా రక్షణ శాఖ అధికారులు ఈ దాడులను ధృవీకరించారు. రాత్రికి రాత్రే అమెరికా వాయుసేన ఇరాన్ భూభాగంలోని కీలక సైనిక…
