నటుడు పృథ్వీరాజ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన మొదటి రెమ్యునరేషన్ రూ. 50,000 రూపాయలు అని, అయితే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేసిన యానిమల్ చిత్రానికి తన కెరీర్లోనే అత్యధిక పారితోషికం అందిందని తెలిపారు. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలలో చేసిన పనికి మంచి రెమ్యునరేషన్ లభించిందని, ముఖ్యంగా యానిమల్ చిత్రానికి గాను మంచి పారితోషికం వచ్చిందని ఆయన తెలిపారు. వేలల్లో మొదలైన తన పారితోషికం ఇప్పుడు లక్షల్లో ఉందని అన్నారు. యానిమల్ చిత్రంలో తన పాత్రను ఒక్క మాటలో వివరించమని కోరగా, పృథ్వీరాజ్ “సందీప్ రెడ్డి వంగ” అని సమాధానమిచ్చారు. దర్శకుడి దృష్టి, అభిరుచి, మూర్ఖత్వమే ఆ పాత్రకు కారణమని ఆయన ప్రశంసించారు. సందీప్ రెడ్డి వంగ ఒక పనిపై నూటికి నూరు శాతం దృష్టి సారిస్తారని, ఆయనకు వ్యక్తిగత జీవితం అంటూ ఏమీ ఉండదని పృథ్వీరాజ్ వివరించారు. తన పని గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి అని కొనియాడారు. యానిమల్ చిత్రాన్ని కనీసం నాలుగు, ఐదు సార్లు చూస్తే గానీ ప్రతి షాట్ లోని లోతైన అర్థం అర్థం కాదని పృథ్వీరాజ్ అన్నారు. హీరో రీ-ఇంట్రడక్షన్ సన్నివేశంలో, ఇతర దర్శకులు కారులో గ్రాండ్ ఎంట్రీ చూపిస్తే, సందీప్ రెడ్డి వంగ హీరోను పునర్జన్మ పొందిన శిశువులా నగ్నంగా చూపించడం ఆయన దూరదృష్టికి నిదర్శనమని వివరించారు పృథ్వీ.
ఇది కూడా చదవండి : 23 ఏళ్లకే అన్ని చూసేసా.. ప్రేమ పేరుతో చాలా మంది మోసం చేశారు.. నటి ఎమోషనల్ కామెంట్స్
సందీప్ రెడ్డి వంగ సెట్లో ఎప్పుడూ రాజీపడరని పృథ్వీరాజ్ ఒక సంఘటన ద్వారా తెలిపారు. ఒక బార్ సన్నివేశంలో, పృథ్వీరాజ్ ఒక స్టూల్పై కూర్చోవడానికి బదులుగా దూకి కూర్చోవాలని సందీప్ రెడ్డి వంగ కోరారట. పృథ్వీరాజ్ బాగానే చేశారని అనుకున్నా, దర్శకుడు నాలుగు టేక్లు చేయించారని, “మీరు నటిస్తుంటే చూడటం చాలా ఇష్టం” అని చెప్పారట. తనను రాజీపడనివ్వకుండా, తన నుంచి అత్యుత్తమ నటనను రాబట్టుకునే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అని పృథ్వీరాజ్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి : అందరూ ఎదో అనుకుంటారు.. కానీ ఆ హీరో గొప్ప డాన్సర్..! అతను డ్యాన్స్ చేస్తుంటే చూస్తుండిపోవాలనిపిస్తుంది..
వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. తనకు వంట రాదని, అయితే కాఫీ, చపాతీ, గుడ్లు, మ్యాగీ వంటివి చేయగలనని పృథ్వీరాజ్ చెప్పారు. తన అభిమాన ఆహారం చికెన్ అని, అది నిజానికి శాకాహారం (వెజిటేరియన్) అని హాస్యంగా వ్యాఖ్యానించారు, చికెన్ వెజిటేరియన్ ఫుడ్ తింటుంది కాబట్టి అది వెజిటేరియనే అవుతుందని తనదైన శైలిలో వివరించారు. తన ఖాళీ సమయంలో జిమ్, రన్నింగ్, హార్స్ రైడింగ్, పారామోటరింగ్ వంటివి చేస్తానని పృథ్వీరాజ్ తెలిపారు. ప్రస్తుతం తనకు 59 సంవత్సరాలు అని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి కారణంగా షుగర్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు ఏమీ లేవని పేర్కొన్నారు. టాలీవుడ్లో తన ఆరాధ్య దైవం నందమూరి బాలకృష్ణ అని, ఆయన ఎప్పుడూ తనను “రా పృథ్వీ, కూర్చో” అంటూ ఆప్యాయంగా పలకరిస్తారని, బాలయ్య చుట్టూ ఎప్పుడూ ఆర్టిస్టులు ఉంటారని, ఆయనతో మాట్లాడటం తనకు ఎంతో ఇష్టమని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా.. సంచలన విషయం చెప్పిన నటుడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
