India vs England 1st ODI: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు టీ20 సిరీస్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోయి, భారత జట్టు ఇప్పుడు తన పూర్తి దృష్టిని ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్పై కేంద్రీకరించింది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. యూకే టూర్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన టీం ఇండియా, ఈ వన్డే సిరీస్నైనా కైవసం చేసుకుని తన పరువు కాపాడుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో సీనియర్ ఆటగాళ్లైన కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రాలపై భారీ బాధ్యత పడింది.
ఇంగ్లీష్ బౌలర్ల గుండెల్లో వణుకు పుట్టించే ‘హిట్ మన్’ రికార్డులు..!
ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అంతర్జాతీయ క్రికెట్లో కేవలం వన్డే ఫార్మాట్పైనే ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇంగ్లాండ్లోని పిచ్చులు వేగవంతమైన స్వింగ్ బౌలింగ్కు ప్రసిద్ధి. ఎంతటి మేటి బ్యాటర్లయినా సరే అక్కడ ఇంగ్లీష్ బౌలర్ల దాటికి తలవంచక తప్పదు. కానీ ప్రపంచ క్రికెట్లో తమదైన ముద్ర వేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఆ పిచ్చులపై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. గతంలో వారు ఇంగ్లాండ్ బౌలర్లను వారి సొంత గడ్డపైనే సమర్థవంతంగా ఎదుర్కొని భారీగా పరుగులు రాబట్టారు.
ఇదికూడా చదవండి: కొంపముంచిన 7 మ్యాచ్లు.. 2028 టీ20 ప్రపంచకప్ రేసు నుంచి ముగ్గురు భారత ఆటగాళ్లు ఔట్..?
ఇవి కూడా చదవండి
ముఖ్యంగా హిట్ మన్ రోహిత్ శర్మకు ఇంగ్లాండ్ పిచ్చులపై తిరుగులేని రికార్డు ఉంది. ఇంగ్లీష్ బౌలర్లను వారి సొంత మైదానాల్లో ఉతికేయడంలో రోహిత్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇంగ్లాండ్ గడ్డపై రోహిత్ శర్మ ఇప్పటివరకు 27 వన్డే మ్యాచ్లు ఆడి, 64.91 అనే కళ్ళు చెదిరే భారీ సగటుతో ఏకంగా 1,428 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ దేశంలో ఒక విదేశీ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగుల రికార్డు రోహిత్ శర్మ పేరిటే ఉండటం విశేషం. అక్కడ రోహిత్ ఇప్పటివరకు 7 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు బాది రారాజుగా నిలిచాడు.
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. ఇంగ్లాండ్ గడ్డపై రన్ మెషిన్ హవా..!
రోహిత్ శర్మతో పాటు కింగ్ విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లీష్ గడ్డపై అద్భుతమైన గణాంకాలను కలిగి ఉన్నాడు. ఇంగ్లాండ్ పిచ్చులపై విరాట్ కోహ్లీ వన్డే సగటు 51.88 గా ఉందంటేనే అతడి ఆధిపత్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్లో ఆడిన 33 వన్డే మ్యాచ్ల్లో కోహ్లీ 1,349 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ వన్డే సిరీస్లో కూడా వీరిద్దరి నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్లను ఆశిస్తున్నారు.
ఇదికూడా చదవండి: టీమిండియాలో ఆ ముగ్గురి చాప్టర్ క్లోజ్.. ఇంగ్లాండ్ సిరీస్ ఓటమితో ఇక జట్టులో నో ప్లేస్..?
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ పూర్తి షెడ్యూల్..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ ప్రతిష్టాత్మక మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి:
తొలి వన్డే: రేపు (బుధవారం) బర్మింగ్హం వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది.
రెండో వన్డే: జూలై 16వ తేదీన కార్డిఫ్ మైదానంలో రెండో మ్యాచ్ నిర్వహిస్తారు.
చివరి వన్డే: జూలై 19వ తేదీన చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ జరగనుంది.
ఇదికూడా చదవండి: Team India: రోహిత్ ఒక్కడే కాదు భయ్యో.. ఆ ముగ్గురికి చావో రేవో సిరీస్.. టార్గెట్ మాత్రం అదే..?
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
