క్యాన్సర్ రోగులపై అదనపు భారం.. కీమోథెరపీ మందుల ధరల పెంపునకు కేంద్రం ఆమోదం
క్యాన్సర్ చికిత్సలో వాడే కీలకమైన కెమోథెరపీ ఔషధాల ధరల పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న రోగులకు అదనపు భారం పడనున్నట్లు పేర్కొంటున్నారు.. దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్రమైన కొరతను అధిగమించేందుకు, ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు గాను.. కీలకమైన కొన్ని కెమోథెరపీ ఔషధాల (Chemotherapy Drugs) ధరలను పెంచింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొరతను ఎదుర్కొంటున్న రెండు కీలక కీమోథెరపీ మందులైన సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్ల ధరల పెంపునకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఓ…
