ప్రోటోకాల్ పక్కనబెట్టి.. రైతు వద్దకు వెళ్లిన జిల్లా కలెక్టర్.. ప్రజల వద్దకే పాలన అంటే ఇదే!
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో గుంటూరు జిల్లా కలెక్టరేట్ వేదికగా ఒక మానవీయ ఘట్టం ఆవిష్కృతమైంది. మంచానికే పరిమితమైన ఒక పక్షవాత బాధితుడు తన భూసమస్యను చెప్పుకోవడానికి ఆటోలో కలెక్టరేట్కు వచ్చాడు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ స్వయంగా కాన్ఫరెన్స్ హాల్ నుండి కిందికి దిగివచ్చారు. నేరుగా ఆటో వద్దే బాధితుడి బాధలను ఆలకించారు. కలెక్టర్ చూపిన ఈ చొరవ, మానవత్వంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సోమవారం (జూన్ 08) గుంటూరు…
