హైదరాబాద్- ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక మార్పులు.. కొత్త స్టేషన్లు వచ్చేది ఈ ప్రాంతాల్లోనే!
తెలంగాణలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు విషంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. హైదరాబాద్-పూణె మీదుగా ముంబై వరకు బుల్లెట్ రైలును తీసుకురావాలని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదనలు జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత స్టేషన్ల ఏర్పాటులో మార్పులు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్-పుణె-ముంబయి బుల్లెట్ రైలు కారిడార్లో భాగంగా వికారాబాద్ కాకుండా అనంతగిరిలో రైల్వే స్టేషన్ను ఏర్పాటు…
