తాజావార్తలు

హైదరాబాద్‌- ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక మార్పులు.. కొత్త స్టేషన్‌లు వచ్చేది ఈ ప్రాంతాల్లోనే!

హైదరాబాద్‌- ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక మార్పులు.. కొత్త స్టేషన్‌లు వచ్చేది ఈ ప్రాంతాల్లోనే!


తెలంగాణలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు విషంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. హైదరాబాద్-పూణె మీదుగా ముంబై వరకు బుల్లెట్‌ రైలును తీసుకురావాలని నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రతిపాదనలు జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత స్టేషన్‌ల ఏర్పాటులో మార్పులు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌-పుణె-ముంబయి బుల్లెట్‌ రైలు కారిడార్‌లో భాగంగా వికారాబాద్‌ కాకుండా అనంతగిరిలో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే కోకాపేట స్టేషన్‌ విషయంలో భారీగా వ్యయప్రయాసలు ఉన్నాయని.. ఇదే విషయాన్ని NHRCL దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

దీనిలో పాటు హైదరాబాద్-టూ- బెంగళూరు రైల్వే ప్రాజెక్టుఉలో భాగంగా సోమశీలలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో సోమశిల, అనంతగిరిలలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కోసమే ఈ ప్రాంతాల్లో బుల్లెట్‌ రైలు స్టేషన్‌ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇదే అంశంపై ఇవాళ ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ అధికారులతో ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు.

అయితే NHRCL ప్రతిపాదన ప్రకారం.. కోకాపేటలోని నియోపోలీస్ ప్రాంతంలో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం NHRCL 247 ఎకరాల భూమిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఆ ప్రాంతంలో ఎకరం భూమి ధర రూజ.150 కోట్లకు పైగా పలుకుతుండడంతో ప్రాజెక్టు మొత్తం ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది. అంటే స్టేషన్ మొత్తం పూర్తి అవడానికి రూ.1.90లక్షల అవ్వొచ్చని ప్రభుత్వం అంచనా వేయగా.. కేవలం ఈ భూమిని సేకరించేందుకే రూ.37 వేల కోట్ల ఖర్చు పెట్టాల్సి వస్తోందని అంచనా వేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *