పైలట్స్ బీ అలర్ట్.. ఇకపై ప్రతి ఏటా డోపింగ్ పరీక్ష !
దేశంలోని ప్రతి వాణిజ్య పైలట్కు సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా రాండమ్ డోపింగ్ పరీక్ష నిర్వహించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం మొత్తం పైలట్ నెట్వర్క్లో కేవలం 10 శాతం మందికి మాత్రమే రాండమ్గా డోప్ టెస్టులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలు, ఇతర భాగస్వాములతో చర్చలు జరుపుతూ 100 శాతం పరీక్షల అమలుపై…
