ఇథనాల్ రహిత పెట్రోల్ ఉండదు! E20పై సమస్యలుంటే ఫిర్యాదు చేయొచ్చు.. కేంద్రం సంచలన నిర్ణయం
దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న E20 పెట్రోల్ పూర్తిగా సురక్షితమైనది, పర్యావరణహితమైనది, సాంకేతికంగా మెరుగైన ఇంధనమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. E20 పెట్రోల్ను ఉపసంహరించుకోవడం లేదా తిరిగి ఇథనాల్ తక్కువగా కలిపిన పెట్రోల్కు వెళ్లే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి పార్లమెంట్కు తెలిపారు. పార్లమెంట్లో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతం ఉన్న 20 శాతం (E20) కంటే ఎక్కువకు పెంచే నిర్ణయం కూడా…
