దోమలను తరిమేందుకు కారులో అగరువత్తులు వెలిగించిన యువకుడు.. తెల్లారేసరికల్లా ఘోరం..!
మధ్యప్రదేశ్లో దారుణం వెలుగులోకి వచ్చింది. జబల్పూర్లో కారులో వెళుతూ ఒక యువకుడు విషాదకరంగా మరణించాడు. ఉదయం వాకింగ్ కోసం బయటకు వెళ్లిన జనంతో ఆ ప్రాంతం భయాందోళనలకు గురైంది. రోడ్డు పక్కన పార్క్ చేసిన స్కార్పియో నుండి మంటలు వెలువడుతున్నాయి. లోపలి నుండి అరుపులు వినిపించాయి. ఈ సంఘటన అందరినీ వణికిస్తోంది. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. జబల్పూర్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెహోరా పోలీస్ స్టేషన్…
