తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..
తల్లిదండ్రులను దైవాలుగా పూజించాలని భారతీయ సనాతన ధర్మం బోధిస్తున్నది. కానీ, నేటి సమాజంలో వృద్ధులైన తల్లిదండ్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వారి ఆస్తులను లాక్కొని బిడ్డలు వారిని ఇంటినుంచి గెంటివేసి రోడ్డుపాలు చేస్తున్నారు. మరికొంతమందిని వృద్ధాశ్రమాలకు తరిమివేసి వారి బాగోగులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారు అనారోగ్యం పాలైతే కనీసం వైద్యం చేయించే పరిస్థితి కూడా లేదు. కనీ పెంచి పెద్ద చేసి తమ సర్వస్వాన్ని పిల్లల కోసం దారపోసిన తల్లిదండ్రుల బాగోగులను చూడకుండా నిర్లక్ష్యం…
