అయ్.. బాబోయ్ అడుగడుగునా పాములే.. జనాల్లో భయం భయం
ఇన్నాళ్లు భూమిలోని పుట్టల్లో… బండల కింద… పొదల్లో దాక్కున్న పాములు… వర్షం కురిసిన తర్వాత ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి. అదే సమయంలో కప్పలు, ఎలుకలు, ఇతర క్రిమికీటకాలు కూడా ఎక్కువగా సంచరిస్తుండటంతో… వాటి వేటలో పాములు పొలాలు, కాలనీలు, ఇళ్ల పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. కరీంనగర్, రామగుండం, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా గోదావరిఖని ప్రాంతంలో భూమి వేడి తగ్గడంతో… పాములు అధికంగా బయటకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు….
