గ్రామ యువకులు, పెద్దలు కలిసి పవిత్రమైన పురాతన బావి నుండి 101 బిందెలతో నీటిని తోడారు. అనంతరం డప్పు వాయిద్యాల నడుమ, ‘ఓం నమః శివాయ’ నామస్మరణతో గ్రామంలో ఉన్న మొత్తం 18 దేవాలయాలకు ఆ జలాలను తీసుకెళ్లారు. ఆయా ఆలయాల్లోని శివలింగాలకు అత్యంత భక్తిశ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించి, త్వరగా వర్షాలు కురిపించాలని కోరుకుంటున్నారు.
