Andhra: ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ చూడండి..
ఉత్తర శ్రీలంక తీరము, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం అదే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో మంగళవారం (12-05-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి…
