UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. సామాన్యులపై కూడా భారం పడుతుందా..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
యూపీఐ రాకతో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లలో వేగం పెరిగింది. టీ షాప్, కిరాణా షాపుల వద్ద చిన్న మొత్తాల నుంచి పెద్ద లావాదేవీల వరకు యూపీఐ ద్వారా సెకన్లలోనే పూర్తి చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే క్షణాల్లోనే పేమెంట్ పూర్తవుతుంది. అయితే యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించనున్నారనే వార్తల క్రమంలో చాలామంది ఆందోళన చెందుతున్నారు. సామాన్యుల నుంచి దుకాణదారుల వరకు ప్రతిఒక్కరిలో కలవరం మొదలైంది. ఆ భారాన్ని తాము మోయాల్సి వస్తుందేమోనని…
