TGSRTC బస్సులో టికెట్లు ఇస్తూ కుప్పకూలిన కండక్టర్.. క్షణాల్లో మృతి!
భద్రాద్రి కొత్తగూడెం, మే 26: విధి నిర్వహణలో ఉండగానే ఓ ఆర్టీసీ కండక్టర్ బస్సులోనే ప్రాణాలొదిలాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి హనుమ కొండకు వెళ్తున్న పరకాల ఆర్టీసీ డిపో బస్సులో ఈ విషాదం చోటుచేసుకుంది. అనిశెట్టి పల్లి బ్రిడ్జి సమీపంలో బస్సులో ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ కండక్టర్ బిరిల్లి శంకర్ (50) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు, డ్రైవర్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు 108 అంబులెన్స్ కు…
