5 రోజులుగా 4 రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ.. చివరకు చిన్న క్లూతో సాదిక్ అరెస్ట్!
కాకినాడ, ఆగస్ట్ 23: కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రైఫిల్ షూటింగ్ ట్రైనర్ సాదిక్ఖాన్ను పోలీసులు ఉత్తర్ప్రదేశ్లోని మీరట్లో అరెస్ట్ చేశారు. గత ఐదు రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న అతడిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. సాదిక్ఖాన్ ఫోన్ వినియోగం, డిజిటల్ లావాదేవీలకు దూరంగా ఉంటూ నాలుగు రాష్ట్రాల్లో తిరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే…
