ఉడకబెట్టిన పల్లీలా.. వేయించినవా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది..?
పల్లీలను ఉడకబెట్టి తినడం మంచిదా? లేక వేయించి తినడం మంచిదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. పోషకాహార నిపుణుల ప్రకారం.. వేయించిన పల్లీల కంటే ఉడకబెట్టిన పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. వేరుశనగలను ఉడకబెట్టినప్పుడు వాటిలో ఉండే పాలీఫెనాల్స్ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దాదాపు 4 రెట్లు పెరుగుతాయి. ఇవి శరీర కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడమే కాకుండా, దీర్ఘకాలిక గుండె జబ్బులు, షుగర్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి. మరోవైపు బరువు తగ్గాలనుకునే వారికి…
