తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్.. ఒకే బస్సులో విధులు
రక్తసంబంధం ఒకే బస్సులో వృత్తిపరమైన బాధ్యతగా మారింది. తండ్రి బస్సు స్టీరింగ్ పట్టుకోగా, అదే బస్సులో కొడుకు టికెట్లు కొడుతూ ప్రయాణికులకు సేవలు అందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో చోటుచేసుకున్న ఈ అరుదైన సన్నివేశం స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, ఎంతో స్ఫూర్తిని నింపింది. సిద్దిపేట జిల్లాకు చెందిన బంధనాపురం ఎల్లయ్య హుస్నాబాద్ డిపోలో గత 34 ఏళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నారు. తన సుదీర్ఘ కెరీర్లో ఒక్క చిన్న ప్రమాదం కూడా చేయని…
