జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగోళ్లు.. ‘టాప్’ లేపిన ఐఐటీ మద్రాస్ జోన్
హైదరాబాద్, జూన్ 1: దేశ వ్యాప్తంగా ఉన్న 23 ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు ఈ రోజు (జూన్ 1న) ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐఐటీ రూర్కీ ర్యాంకులను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మే 17న జరిగిన ఈ పరీక్షలో రెండు పేపర్లకు కలిపి దేశ వ్యాప్తంగా మొత్తం 1,79,694 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో దాదాపు 56,880 మంది అర్హత సాధించారు. వీరిలో…
