NEET 2026 re-exam Exam: నీట్ 2026 రీటెస్ట్ నేడే.. 22 లక్షల మంది విద్యార్థులపై AI, త్రివిధ దళాల నిఘా
మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ 2026 రీ-టెస్ట్ కు కౌంట్డౌన్ మొదలైంది. దేశవ్యాప్తంగా నభూతో అనే రీతిలో నీట్ పరీక్ష జరగబోతోంది. మొత్తం 22 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 సెంటర్లతో కలిపి.. మొత్తం 5వేల 440 పరీక్షా కేంద్రాలను NTA ఏర్పాటు చేసింది. పరీక్షల్లో అక్రమాలకు, కాపీయింగ్కు అడ్డుకట్ట వేసేందుకు ఈసారి టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడుతున్నారు. 95 వేలకు పైగా గదుల్లో.. ఏకంగా లక్షా…
