ఉరవకొండ చేనేతకు అరుదైన గౌరవం
అనంతపురం జిల్లా ఉరవకొండలో మగ్గంపై నేసిన పట్టు చీరను ఉగాది పండుగ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కట్టుకోవడంతో.. ఉరవకొండ చేనేతకు అరుదైన గౌరవం దక్కిందంటున్నారు చేనేత కార్మికులు. మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ తరపున మగ్గంపై నేసిన పట్టుచీరలను అందించేందుకు ఉరవకొండ చేనేత కార్మికులకు 30 పట్టుచీరలు నేయాల్సిందిగా చేనేత జోలి శాఖ కమిషనర్ రేఖారాణి విజ్ఞప్తి చేశారు. 30 పట్టుచీరలు మగ్గాలపై నేసేందుకు అవసరమైన ముడిసరుకు,…
