అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. తిరిగి శవమై వచ్చాడు! మిస్టరీగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
చిత్తూరు, జూన్ 14: ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లాలో బంగారుపాళ్యం మండలం జి.కురప్పల్లె గ్రామానికి చెందిన జయదీప్ అనే యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. అయితే తమ కుమారుడిని పథకం ప్రకారం పిలిపించి దాడి చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. యువతి ఫోన్తో గ్రామానికి వెళ్లిన జయదీప్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గత వారం…
