LPG సబ్సీడీ కావాలా? అయితే ఇక ప్రతి ఏడాది ఇది తప్పనిసరి
కేంద్ర ప్రభుత్వ ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక సూచనలు జారీ చేశాయి. గ్యాస్ సబ్సిడీ కొనసాగాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేశాయి. ఇండియన్ ఆయిల్, హెచ్పీ, భారత్ పెట్రోలియం వంటి కంపెనీల వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్ వినియోగదారులు మూడు మార్గాల్లో ఈ-కేవైసీ చేయించుకోవచ్చు. సంబంధిత గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్ ద్వారా…
