ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు.. వినూత్న రీతిలో నిరసనకు దిగిన జనసేన నేత
ముదినేపల్లి మండలం వనుదుర్రు శివారు కొత్తపల్లిలోని పంచాయతీ మంచినీటి పథకానికి కేటాయించిన స్థలంలో ఈ ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో మంచినీటి చెరువు కట్టపై ఐదు ఇళ్లు, ఒక పశువుల పాకతో పాటు వాటికి సంబంధించిన సెప్టిక్ ట్యాంకులు నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణాల వల్ల ప్రజా ప్రయోజనార్థం ఉద్దేశించిన మంచినీటి చెరువు అపవిత్రమవుతోందని, వీటిని తక్షణమే తొలగించాలని కోరుతూ జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ సభ్యుడు మట్టపూడి మదన్కుమార్ గత…
