IPL 2026: కాటేరమ్మ కొడుకుల ఊచకోత.. సొంతగడ్డపై ముంబైను చిత్తు చేసిన హైదరాబాద్
ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన 41వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఏకంగా తన సొంతగడ్డపైనే ముంబైను ఉతికి ఆరేసింది. ముంబై అందించిన భారీ టార్గెట్ను సైతం సునాయసంగా 6 వికెట్ల తేడాతో ఛేదించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 55…
