3.8 కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వత బూడిదలో పెనవేసుకుని ఉండి పోయిన నాలుగు పాములు..! శాస్త్రవేత్తలకే షాకిచ్చే నిజాలు..?
సాధారణంగా పాములు ఒంటరిగా జీవించే అలవాటు ఉన్న జీవులుగా భావిస్తారు. అయితే, వ్యోమింగ్ ప్రాంతంలోని ఇయోసిన్ యుగానికి చెందిన రాతి పొరల్లో కనుగొన్న ఈ శిలాజంలో నాలుగు పాములు ఒకదానికొకటి చుట్టుకుని, ఒకే బిలంలో సురక్షితంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్రమైన చలి వాతావరణం లేదా విషమ పరిస్థితుల నుంచి తట్టుకోవడానికి, తమ శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి ఇవి ఒకే చోట చేరి ఉండి ఉంటాయని భావిస్తున్నారు. అదే సమయంలో అనూహ్యంగా మట్టిచరియలు లేదా శిథిలాలు పడి…
