అయ్యో బిడ్డా.. చింత గింజలు గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి!
ఆదిలాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. చింత గింజలు గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. పట్టణ శివారు ప్రాంతంలోని కేఆర్కే కాలనీలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆడుకుంటూ చింతకాయలు తింటున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కేఆర్కే కాలనీకి చెందిన మంగేశ్ అనే ఏడేళ్ల బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో చింతకాయలు తింటూ వాటిలోని గింజలను నములుతున్నాడు. అయితే అనుకోకుండా గింజలు ఒకేసారి గొంతులో…
