Bilva Patra : శివుడికి బిల్వ ఆకులు ఎలా పడితే అలా పెడుతున్నారా?.. పూజా ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి!
హిందూ మతంలో శివారాధనకు బిల్వపత్రానికి ఉన్నంత ప్రాధాన్యత మరే ఇతర పత్రానికీ లేదు. “త్రితలం త్రిగుణకారం త్రినేత్రంజ త్రియాయుతం” అన్నట్లుగా.. మూడు ఆకులు కలిసి ఉండే ఈ పత్రం జన్మజన్మల పాపాలను హరిస్తుందని భక్తుల నమ్మకం. స్కంద పురాణం ప్రకారం, మందర పర్వతంపై పార్వతీ దేవి తపస్సు చేస్తున్న సమయంలో ఆమె చెమట బిందువు నేలపై పడగా బిల్వ వృక్షం ఉద్భవించింది. ఈ చెట్టు వేర్లలో గిరిజాదేవి, కాండంలో మహేశ్వరి, కొమ్మలలో దాక్షాయిని, ఆకులలో పార్వతీ దేవి…
