IND Vs NZ: అదిగో పులి వచ్చింది.. కివీస్ సచ్చింది.. 20 ఫోర్లు, 8 సిక్సర్ల విశ్వరూపం.. ఊచకోత మాములుగా లేదుగా
రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా ఐకానిక్ విజయాన్ని అందుకుంది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే చేరుకొని టీ20 చరిత్రలో 200+ పరుగులను అత్యంత వేగంగా చేధించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఈ విజయంతో సిరీస్లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో రెండు మార్పులు చేశారు టీమ్ మేనేజ్మెంట్. అక్షర్ పటేల్ స్థానంలో హర్షిత్ రానా,…
