నానమ్మను చూసేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు ముగ్గురు చిన్నారులు..
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నానమ్మ ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటి గుంతలో పడి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించింది. ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ లోని తుర్కయాంజల్ లో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి తల్లి అనారోగ్యంగా ఉండడంతో కుటుంబంతో సహా నిన్న స్వగ్రామం ముచ్చర్లపల్లికి వచ్చాడు. ఆదివారం సెలవుదినం కావడంతో మధ్యాహ్నం తమ వ్యవసాయ పోలం…
