Andhra: చేసేదే పాడుపని.. మళ్లీ రుబాబా..! తండ్రీ, కూతురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఎస్సై.. ఆ తర్వాత
ఆంధ్రా – కర్ణాటక సరిహద్దులో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.. అయినా అక్రమ మద్యం వ్యాపారులు ఎంతకు తెగించారంటే.. తమ గుట్టు రట్టు చేసిన మహిళ ఎస్సై పై దాడికి పాల్పడ్డారు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని ఆగలి మహిళా ఎస్సై పై అక్రమ మద్యం వ్యాపారులు దాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది.. అగలి మండలం ఇరిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్సై శోభారాణి…
