ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ సామూహిక గృహ ప్రవేశాల పండుగ ఘనంగా జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో విడత ఇళ్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రెండున్నర లక్షల ఇళ్లలో లక్ష టిడ్కో గృహాలు కాగా, మరో లక్షన్నర ఇతర కేటగిరీల ఇళ్లు ఉన్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట మండలం,…
