గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారుల కసరత్తు
2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. నగరంలోకి వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ను రూపొందిస్తున్నారు. వేమగిరి, ధవళేశ్వరం, బొమ్మూరు, మోరంపూడి మరియు కోటిలింగాల రేవు వరకు ఉన్న ప్రధాన మార్గాలను అధికారులు తనిఖీ చేశారు. ప్రధాన…
