Amit Shah : ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ స్మార్ట్ బోర్డర్గా భారత సరిహద్దులు.. అమిత్ షా కీలక ప్రకటన!
భారతదేశ సరిహద్దులను శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే స్మార్ట్ బోర్డర్ దార్శనికతతో దేశ సరిహద్దు భద్రతా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా రూపాంతరం చెందబోతోంది. ఇందుకోసం సురక్షితమైన సరిహద్దు, సుసంపన్నమైన సరిహద్దు ప్రాంతం, అప్రమత్తమైన సమాజం అనే త్రిసూత్రంతో దేశాన్ని సురక్షితంగా ఉంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. పరోక్ష యుద్ధం, అక్రమ చొరబాట్లు, తీవ్రవాద భావజాలం,డ్రగ్స్, స్మగ్లింగ్, డ్రోన్ దాడులు, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత…
