సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!
కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ అదృష్టం కలిసి వచ్చింది. సముద్రంలో వేసిన వలలకు పెద్దపెద్ద చేపలు భారీ ఎత్తున చిక్కడంతో గంగపుత్రులకు పంట పండింది. అందులోనూ.. కొమ్ముకోణం చేపలు.. విలువైన ఎల్లోఫిన్ ట్యూనా చేపలు అధిక సంఖ్యలో లభించడంతో సంబర పడిపోయారు. సముద్రంలో వలలకు చిక్కిన ఈ చేపలను మత్స్యకారులు తమ పడవలలో తీసుకువచ్చి కాకినాడలోని కుంభాభిషేకం రేవు ఒడ్డుకు చేరవేయడంతో సందడి నెలకొంది. భారీగా బరువు కూడా ఉండడంతో ఆయా చేపలను ఒడ్డుకు…
