Andhra Pradesh: 5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను జయించిన ఏపీ దివ్యాంగ విద్యార్థులు..
నువ్వు చేయలేవు.. నీ వల్ల కాదు.. అని ఎవరైనా చెప్పినప్పుడు చాలా మంది వెనక్కి తగ్గిపోతారు. కానీ అదే మాటలను బలంగా తీసుకుని ముందుకు వెళ్లిన పిల్లల కథ ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 21 మంది విద్యార్థులు, ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొని చివరకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు చేరుకున్నారు. ఇది కేవలం ఒక ట్రెక్కింగ్ యాత్ర కాదు తమను తక్కువగా చూసిన ప్రతి ఒక్కరికీ ఇచ్చిన సమాధానం. ఈ పిల్లల్లో కొందరికి…
