ముఖ్యంగా ఈ సమయంలో వరి, విత్తనాలు చల్లడం, కొన్ని ప్రదేశాల్లో నాట్లు వేయడం కూడా చేస్తుంటారు. అంతే కాకుండా కంది, పెసర, మినుములు వంటి పప్పు ధాన్యాలను విత్తుతారు. ఇవే కాకుండా కూరగాయలు టమాట, వంకాయ, బెండకాయ, బీరకాయ వంటి కూరగాయ విత్తనాలు కూడా నాటుతారు. మృగశిరం సమయంలో ఈ విత్తనాలు నాటడం వలన మంచి దిగుబడి వస్తుందంట.
