Vaibhav Suryavanshi, Abhishek Sharma: భారత టీ20 క్రికెట్లో సరికొత్త విప్లవం రాబోతోంది. ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ త్వరలోనే జాతీయ జట్టులోకి అరంగేట్రం చేయనున్నాడు. ఇదే కనుక నిజమైతే, విధ్వంసకర వీరుడు అభిషేక్ శర్మతో కలిసి అతడు ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
సంచలన నిర్ణయానికి బీసీసీఐ సన్నద్ధం: దేవాజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు..
కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన బీహార్ కుర్రాడు, రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని టీమ్ ఇండియా సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రెటరీ దేవాజిత్ సైకియా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైభవ్ సూర్యవంశీ త్వరలోనే భారత సీనియర్ జట్టులో కనిపిస్తాడని, ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణించిన యువ ఆటగాళ్లపై సెలెక్టర్లు ప్రత్యేక నిఘా ఉంచారని ఆయన స్పష్టం చేశారు. వైభవ్ భారత క్రికెట్లో ఒక అద్భుతమైన ఆణిముత్యమని, రాబోయే రోజుల్లో అతడు ప్రపంచ క్రికెట్ను శాసిస్తాడని తాను బలంగా నమ్ముతున్నట్లు సైకియా పేర్కొన్నారు. ఇప్పటికే సెలెక్టర్లు అతన్ని జాతీయ జట్టులోకి తీసుకునేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారని వెల్లడించడంతో, వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం ఇక లాంఛనమేనని స్పష్టమవుతోంది.
మారనున్న ఓపెనింగ్ జోడి: బౌలర్లకు ఇక చుక్కలే..!
ఒకవేళ వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి వస్తే, టీ20 ఫార్మాట్లో సరికొత్త ఓపెనింగ్ జోడిని చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. ప్రస్తుతం టీ20ల్లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా రాణిస్తున్నారు. అయితే, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న అభిషేక్ శర్మ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. పవర్ప్లేలో అతడు ఆడే విధ్వంసకర ఆటతీరుతో ప్రపంచంలోని మిగతా జట్లు సైతం తమ వ్యూహాలను మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అతనికి తోడుగా వైభవ్ కూడా తోడైతే, టీమ్ ఇండియా ఓపెనింగ్ జోడి ప్రత్యర్థులకు పీడకలగా మారడం ఖాయం. ఇద్దరి స్ట్రైక్ రేట్ కూడా 200 పైనే ఉండటంతో, పవర్ప్లేలోనే మ్యాచ్ను ముగించేంత ప్రమాదకరంగా ఈ జోడి మారే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2026లో ఇద్దరి విధ్వంసకర గణాంకాలు..
ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు ఐపీఎల్ 2026 సీజన్లో సృష్టించిన రికార్డులు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ గణాంకాలు ఇలా ఉన్నాయి:
రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వైభవ్ ఏకంగా 72 సిక్సర్లు, 63 ఫోర్లతో బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించగా, సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ 43 సిక్సర్లు, 50 ఫోర్లతో విరుచుకుపడ్డాడు.
రాబోయే రోజుల్లో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభిస్తే టీమ్ ఇండియా భవిష్యత్తు టీ20 ఫార్మాట్ రూపురేఖలే మారిపోతాయి. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడిగా వీరు అవతరిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరి దూకుడుకు అడ్డుకట్ట వేయడం మిగతా అంతర్జాతీయ జట్లకు అసాధ్యమైన పనిగా మారనుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
