Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది..
విద్యార్థులు ఎంతో జాగ్రత్తగా భద్రపెట్టుకునే ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు ఇకపై మరింత మన్నికగా ఉండనున్నాయి. వర్షాలు, వరదలు, నిర్లక్ష్యం వల్ల సర్టిఫికెట్లు దెబ్బతినే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కొత్త తరహా మెమోలను ప్రవేశపెడుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అందించే లాంగ్ మెమోలు ప్రత్యేక నాన్-టియరబుల్ టెక్నాలజీతో తయారవుతున్నాయి. దీంతో అవి సులభంగా చిరిగిపోవు.. నీటిలో తడిసినా దెబ్బతినవు. ఇప్పటి వరకు సాధారణ కాగితంపై ముద్రించే మార్కుల మెమోలను విద్యార్థులు ప్రత్యేకంగా…
