జాన్వీ కపూర్ 2018లో వచ్చిన ధడక్ అనే హిందీ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఇది మరాఠీ బ్లాక్బస్టర్ సినిమా ‘సైరాట్’కు రీమేక్. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఆమె ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, ‘రూహీ’, ‘మిలీ’, ‘బవాల్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మాహి’ వంటి విభిన్నమైన పాత్రలు ఉన్న సినిమాల్లో నటించి మెప్పించింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనదైన గుర్తింపు తెచ్చుకుంది.
