Hyderabad: అమ్మలేని లోకంలో తాను ఉండలేనని.. తనయుడి షాకింగ్ నిర్ణయం!
హైదరాబాద్, మే 28: తల్లి మరణించి 2 నెలలు కూడా తిరక్కుండానే ఆ ఇంట మరో మరణం కలవరం రేపింది. తల్లి మరణం జీర్ణించుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరిని వీడి ఒకరు ఉండలేక వరుసగా తల్లీకుమారుడు మరణించారు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్లోని మార్కండేయ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్లోని మైలార్దేవపల్లి ప్రాంతంలోని నివాసం ఉంటున్న కొముర రెడ్డి ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడి తల్లి సుమారు రెండు…
