CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఆ ప్రాజెక్టులపైనే మెయిన్ ఫోకస్
తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఆయనతో చర్చించారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–2 విస్తరణ ప్రతిపాదనలను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఫేజ్–2లో 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు రూ.38,595 కోట్ల ప్రతిపాదనలు సమర్పించినట్టు…
