బొగ్గు స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం… ఐప్యాక్ కార్యాలయాలపై ఈడీ దాడులు!
పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ (IPAC) కార్యాలయాలపై దాడులు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో ఈ దాడులు జరుగుతున్నాయి. బెంగళూరులో, కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రిషిరాజ్ సింగ్ కార్యాలయంలోనే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐప్యాక్ వ్యవస్థాపకులు రిషిరాజ్ సింగ్, ప్రతీక్ శర్మ, వినీష్ చందాకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో ED అధికారులు సోదాలు…
