RBI: ఈఎంఐలు కట్టేవారికి రిలీఫ్..! ఆర్బీఐ నుంచి ఊరట రానుందా..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశాలు జూన్ 3న ప్రారంభమవ్వగా.. జూన్ 5 వరకు జరగనున్నాయి. శుక్రవారంతో సమావేశాలు ముగియనుండగా.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనే విషయాలు తెలుసుకునేందుకు మార్కెట్లు, పెట్టుబడిదారులు, బ్యాంకులు, ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఉదయం 10 గంటలకు ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, రూపాయి బలహీనపడుతున్న క్రమంలో ఈ సమావేశంలో…
