Hyderabad: భాగ్యనగరం నడిబొడ్డులో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్..!
తెలంగాణలో డ్రగ్స్ నెట్వర్క్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్ని సీరియస్ వార్నింగ్లు ఇస్తున్నా.. ఎంత మందిని అరెస్టు చేస్తున్నా.. ఎంతగా నిఘా పెడుతున్నా డ్రగ్స్ కేసులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్సే ఈ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. ఈగల్ టీమ్ నిర్వహించే ఆపరేషన్లలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ మహానగరం నడిబొడ్డులో డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. పంజాగుట్టలో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన వీళ్లంతా…
