Andhra Pradesh: బైక్ బ్యాటరీ మారుస్తుండగా చెలరేగిన మంటలు.. పక్కనే పెట్రోల్ బంక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. పెట్రోల్ బంక్ వద్ద ఒక యువకుడు తన బైక్కు బ్యాటరీ మారుస్తుండగా అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. చూస్తుండగానే బైక్ నుండి మంటలు చెలరేగాయి. మొదట చిన్నగా ప్రారంభమైన మంటలు, క్షణాల్లోనే వాహనం అంతటా వ్యాపించి పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. బైక్ పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశానికి అతి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో అందరిలోనూ…
