Telangana: ఆశ చూపించారు.. కోట్లు వచ్చాయన్నారు.. సీన్ కట్ చేస్తే.!
స్టాక్ మార్కెట్లో భారీ లాభాల పేరుతో హైదరాబాద్కు చెందిన సైబర్ మోసగాళ్లు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఇంజనీర్ను రూ.1.5 కోట్లకు పైగా మోసం చేశారు. పుణెలోని సిటీ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్న 41 ఏళ్ల ఇంజనీర్ ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసింది. గత ఏడాది నవంబర్లో బాధితుడి సోదరి ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ఓ యాడ్ చూసి స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై ఆసక్తి చూపించింది. లింక్ క్లిక్ చేయగానే ఆమెను…
