వ్యాపారస్తులకు ఇక లాభాలే లాభాలు.. రాత్రంతా వ్యాపారాలు చేసుకునేలా సర్కార్ వెసులుబాటు..!
ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం మొదలైపోయింది. ప్రత్యేక ప్రార్థనలతో, ఉపవాసాలతో భక్తి ప్రవృత్తుల నడుమ రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలు రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఎంతో నిష్ఠతో అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇప్పటికే నగరాల్లో వ్యాపార, దుకాణ సముదాయాలు కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాపారస్తులు రాత్రంతా తమ వ్యాపారాలను నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం…
